ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అక్టోబర్లో రికార్డ్ జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. కతేడాదితో పోలిస్తే.. నెట్ జీఎస్టీ వసూళ్లు 8.77 శాతం ఎక్కువగా వచ్చాయి. అయితే మొత్తంగా అక్టోబర్లో గ్రాస్ జీఎస్టీ కలెక్షన్లలో 9 శాతం క్షీణత కనిపించింది. ఇక దేశవ్యాప్తంగా సగటున 4.6 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన జీఎస్టీ రేట్లతో పన్నులు గణనీయంగా తగ్గాయి. అయినా దేశవ్యాప్తంగా వసూళ్లను పెరగడం గమనార్హం. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో 10 శాతం వృద్ధి కనిపించింది.