Reliance Biogas Plant at Divakarapalli in Prakasam district: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లీన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలయన్స్ సంస్థతో భారీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 500 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు, 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ ఏప్రిల్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది.