Andhra Pradesh Mgnregs Workers Accident Insurance Rs 2 Lakhs: ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని 1.20 కోట్ల మంది ఉపాధి కూలీలందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన పథకాల కిందకు వీరందరినీ తీసుకురానున్నారు. మే 1 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూన్ నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.