ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు రానున్నాయి. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదనలకు ప్రభుత్వ అనుమతులు జారీ చేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు సిద్ధమైన కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే భూములు కూడా కేటాయించింది. ఈ కంపెనీలు విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో ఐటీ క్యాంపస్లు, సెమీకండక్టర్ యూనిట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా 44 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.