National Highway 340B Dhone Somayajulapalli: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. కర్నూలు జిల్లాలో సోమయాజులపల్లె నుండి డోన్ వరకు 56 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 42 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ రోడ్డు పూర్తయితే డోన్, అనంతపురం, బెంగళూరు వెళ్లే వారికి ప్రయాణం సులువు అవుతుంది.