AP Cabinet Kuppam Dagadarthi Airports: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ రెండు విమానాశ్రయాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తారు. కుప్పం విమానాశ్రయం కోసం 1,200 ఎకరాలు, దగదర్తి విమానాశ్రయం కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరలో విమానాశ్రయాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.