ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చలు జరుపుతోంది. ఇవే కాకుండా కొత్తగా ఏడు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రదిపాదనలను ఏపీ మంత్రివర్గం ఆమోదించాల్సి ఉటుంది. ఆ తర్వాత ప్రజల అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం వెల్లడిస్తారు.