Chengalpattu Express Robbery: ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్రెస్ రైళ్లు మరోసారి దొంగల టార్గెట్గా మారాయి. అనంతపురం జిల్లాలో చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ చోరీ జరిగింది. దుండగులు సిగ్నల్ కేబుల్ కట్ చేసి రైలును ఆపి ప్రయాణికులను బెదిరించి దోచుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పద్మావతి ఎక్స్ప్రెస్లో కూడా ఇదే తరహా దోపిడీ జరిగింది, ప్రయాణికుల నుంచి బంగారం, నగదు అపహరించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.