Andhra Pradesh Ration Distribution Toor Dal: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు మే నెలలో కూడా కందిపప్పు అందడం లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే సరఫరా నిలిచిపోవడంతో, గత నాలుగు నెలలుగా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని సరుకులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కందిపప్పు సరఫరా మాత్రం జరగడం లేదు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే కందిపప్పు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ-కేవైసీ గడువును జూన్ 30 వరకు పొడిగించారు.