Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. గత రెండు, మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న కందిపప్పును అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే కొన్ని జిల్లాల్లో మాత్రమే కందిపప్పు అందుబాటులోకి వచ్చాయి. కంది దిగుబడి తగ్గిపోవడంతో కందిపప్పు పంపిణీ చేయడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం రెండు నెలలుగా కందిపప్పును సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెలలో కొంత అందుబాటులోకి తెచ్చింది.