AP Ration Shops Wheat Flour Rs 20 Per Kg: ఏపీ ప్రభుత్వం రేషన్కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. జనవరి నుంచి రేషన్ షాపుల్లో ప్రజలకు.. గోధుమ పిండి కేజీ రూ.20కే పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రేషన్ షాపుల్లో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీని ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తున్నామన్నారు.. 15 రోజుల పాటూ రేషన్ అందిస్తున్నామన్నారు.