Andhra Pradesh Ration Card Holders EKYC June 30th: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన సూచన.. రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేయించడానికి గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఇతర ప్రయోజనాలు పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి. ఐదేళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మినహాయింపు ఉంది. గడువులోగా పూర్తి చేయని వారి కార్డులు రద్దు అవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.