Andhra Pradesh Ration Distribution Toor Dal: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నవారికి ఇది చేదు వార్త. గత కొన్ని నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, పంపిణీ సక్రమంగా జరగడం లేదు. ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేదలకు తక్కువ ధరకే కందిపప్పు అందించే పథకం ఆగిపోవడంతో ప్రజలు నిరాశలో ఉన్నారు. త్వరలో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.