Andhra Pradesh Ration Distribution No Toor Dal: ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డుదారులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ అక్టోబర్లోనూ కందిపప్పు పంపిణీ లేదని అధికారులు స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం నుంచే కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో, బహిరంగ మార్కెట్లో అధిక ధరల కారణంగా పేదలు కొనుగోలు చేయలేకపోతున్నారు. దసరా, దీపావళి పండుగలు ఉన్నా రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార, రాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కందిపప్పు కష్టాలు ఈ నెల కూడా కొనసాగుతున్నాయి.