AP Farmers Pattadar Passbook Update: రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది! 21 లక్షల పాస్పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయ్. వాటి పంపిణీకి ముందు తప్పులు సరిచేస్తామన్నారు మంత్రి సత్యప్రసాద్. గత ప్రభుత్వ రీసర్వేలో తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. వెబ్ల్యాండ్లో తప్పులు సరిదిద్దామని, కొత్త పాస్పుస్తకాల్లో మార్పులు ఉంటే ఉచితంగానే చేస్తామని తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీలో జాగ్రత్తలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.