Andhra Pradesh Govt Onion Farmers Rs 50000: ఉల్లి రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచింది. పంట నష్టపోయిన వారికి హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం త్వరలోనే అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. మార్కెటింగ్ శాఖ, మార్క్ఫెడ్ క్వింటాలు ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాయి.