Andhra Pradesh Farmers New Electricity Connections: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది. ప్రతి రైతుకు 5 హార్స్పవర్ మోటారును ఉపయోగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కొత్త కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరటనిస్తుంది.