Andhra Pradesh Farmers Pm Kisan Rs 2 Thousand: రైతులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని ఈనెల 24వతేదీన రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి మూడు విడతలుగా ఒక్కో దఫా రూ.2వేలను జమ చేస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 19 విడతలుగా నగదును ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో విడత నగదు జమను ఈనెల 24న చేయనుంది.