AP Farmers Can Get Rs 40000 For Lease Of Lands: ఆంధ్రప్రదేశ్లో రైతులకు పండగే. ఇకపై తమ అసైన్డ్ భూములను పునరుత్పాదక ఇంధన కంపెనీలకు లీజుకు ఇచ్చి, ఎకరానికి రూ.30వేల నుంచి రూ.40వేల వరకు కౌలు పొందొచ్చు. కేబినెట్ ఆమోదించిన ఈ సవరణలతో రైతులు అదనపు ఆదాయం సంపాదించడమే కాకుండా, వారి కుటుంబాల్లోని వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇది రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.