ఏపీలో రైతులకు పండగే.. నేటి నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది

1 month ago 4
Andhra Pradesh Government To Buy Tomatoes From Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టమాటా ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల దగ్గర నేటి నుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Read Entire Article