Andhra Pradesh Farmers Investment Subsidy Released: రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేసింది. అలాగే రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం రూ.12.84 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, మెగా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. పర్యావరణవేత్త కొమెర అంకారావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.