ఆంధ్రప్రదేశ్లో రైతులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న వేళ.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోళ్లు జరిపిన 4 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఏపీకి మరో తుఫాన్ రానుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.