Andhra Pradesh Farmers Money Released: ఏపీలో రైతులకు శుభవార్త. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటలకు ప్రభుత్వం రూ.4.82 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. అంతేకాకుండా మురికొన్ని నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రూ.5 కోట్లు, తొమ్మిది పాలిటెక్నిక్ల ఆధునికీకరణకు రూ.కోటి మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న వైఎస్సార్సీపీ నేత నారమల్లి పద్మజ జీతాన్ని కూడా విడుదల చేసింది.