Annadata Sukhibhava Last Date: ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.2000 అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్ట్ నాలుగో తేదీన తొలి విడుత నిధులను జమ చేసింది. అయితే సాంకేతిక అంశాలతో అక్కడక్కడా కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు అందలేదు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ గడువు (ఆగస్ట్ 25) రేపటితో ముగియనుంది. దీంతో రైతులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.