Ap Govt Pineapples Supplied To Schools: పార్వతీపురం మన్యం జిల్లాలో పైనాపిల్ పండించే గిరిజనులు సరైన ధర లేక, ప్రాసెసింగ్ యూనిట్లు లేక నష్టపోతున్నారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ పాఠశాలల్లో పైనాపిల్ సరఫరా ప్రతిపాదన చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించడంతో, గిరిజన రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది. ఈ వినూత్న ఆలోచనతో విద్యార్థులకు కూడా పోషకాహారం అందుతుంది.