Ap Farmers Paddy Payments In 24 Hours: ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త ధాన్యం అమ్మిన రోజే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, రోజుకు నాలుగుసార్లు చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ బకాయిలను సైతం తీర్చామని, ఈసారి 24 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలు రైతులకు ఉచిత టార్పాలిన్లు కూడా అందిస్తామని వెల్లడించారు.