Andhra Pradesh Farmers Rs 1,10,000: ఏపీలోనిఅనంతపురం, సత్యసాయి, వైయస్సార్, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఇప్పటికే పర్యటించి వివరాలు సేకరిస్తున్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మిగిలిన ప్రాంతాల్లోనూ త్వరలోనే పంట నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇన్పుట్ సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెంచామని గుర్తు చేశారు. రైతులెవరూ అధైర్యపడొద్దు. ఆందోళన చెందొద్దు అన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35 వేల మేర ఇన్పుట్ సబ్సిడీతో పాటు మొక్కలు తిరిగి నాటేందుకు అదనంగా రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.