Andhra Pradesh Cotton Procurement Starts October 21st: ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతులకు శుభవార్త. ఈనెల 21 నుంచి సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రారంభించనుంది. రైతులు కపాస్ కిసాన్, సీఎం యాప్ల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని సులభంగా అమ్మకాలు జరపవచ్చు. జిన్నింగ్ మిల్లులకు దూది బేల్కు రూ.1440 చెల్లించనుంది. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటా రూ.8,110 ప్రకటించారు. అంతేకాదు అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.