ఆంధ్రప్రదేశ్లో శ్మశానవాటికల దుస్థితిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయని వ్యాఖ్యానించింది. నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. మృతదేహాలకు గౌరవంగా, హూందాగా అంత్యక్రియలు జరగాలని.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎస్ను ఆదేశించింది. ఈ ఏపీలో శ్మశానవాటికల్లో సౌకర్యాలు కల్పించాలంటూ దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రాజమండ్రిలో రోడ్డుపై అంతిమ సంస్కారాలు జరిగిన ఘటనను ప్రస్తావించింది.