Andhra Pradesh Govt Hikes Salaries For Laskars: ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి కాలువల పర్యవేక్షణలో లస్కర్ల పాత్ర ముఖ్యమైనది. చాలా కాలంగా వీరంతా జీతాలు సరిపోక ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారి సమస్యలపై స్పందించింది.. ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచింది. ప్రస్తుతం వారికి రోజువారీ రూ.350 ఇస్తుండగా.. దానిని రూ.550కు పెంచుతూ జీవో జారీ చేశారు. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు.