ఏపీలో వంద శాతం అక్షరాస్యత.. వచ్చే ఏడాదికల్లా సాధ్యం: మంత్రి నారా లోకేశ్

2 hours ago 1
2027 సెప్టెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం అక్షరాస్యత సాధన దిశగా అధికారులు పనిచేయాలంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మాట్లాడిన ఆయన ఏపీలో అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. 2024 నాటికి దేశంలోనే అట్టడుగున రాష్ట్ర అక్షరాస్యత 72.6 శాతం ఉండగా, కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని చెప్పారు. బడి బయట ఉన్న 1,64,821 మంది పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చొరవచూపాలి అంటూ అధికారులను ఆదేశించారు.
Read Entire Article