ఏపీలో వారందరి అకౌంట్‌లలో డబ్బులు.. చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 25
Andhra Pradesh Flood Relief Funds Release: విజయవాడ వరదల్లో నష్టపోయినవారికి పరిహారం చెల్లింపులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వరదలతో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను 15రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సీఎం సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఆయా జిల్లాల్లోని పరిస్థితులను ఆరా తీశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో వరదలకు నష్టపోయిన వాహనదారులకు బీమా చెల్లింపు దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉండటంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Entire Article