Andhra Pradesh Nirudyoga Bruthi Scheme 2025: మచిలీపట్నం పర్యటనలో మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు భృతిగా నెలకు రూ.3 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా మహిళలకు అండగా ఉంటామని, వారి పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల పాపాల చిట్టా బయటపెడతామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను తొలగిస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిస్తామని లోకేష్ పేర్కొన్నారు.