AP Govt Sanction Of Touch Phones: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బధిరులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన బధిరులకు టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన, ఇంటర్మీడియట్ పాసైన, సైగల భాష తెలిసిన, 40 శాతం వైకల్యం ఉన్నవారు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు లోపు ఉండాలి. ఇటు దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించడానికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.