Andhra Pradesh Nirudyoga Bruthi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమ శాస్త్రం చదివిన నిరుద్యోగులకు భృతిని విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 599 మంది వేద పండితులకు నెలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి మొత్తం రూ.53.91 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, వేద విద్యార్థులకు ఈ పథకం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.