AP Govt Imam Mouzan Salaries Rs 90 Crores Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్లు, మౌజమ్లకు గౌరవ వేతనాలు విడుదల చేసింది. రూ.90 కోట్లతో గతేడాది, ఈ ఏడాది బకాయిలు చెల్లిస్తారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన 24 గంటల్లోనే ఈ జీవో విడుదలైంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ, విద్యుత్ సంస్థల రుణాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.