Andhra Pradesh Green Tax Reduced: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు ఊరటనిస్తూ గ్రీన్ ట్యాక్స్ను తగ్గించింది. మే నెలలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో లారీ యజమానుల సంఘం ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది. స్పందించిన సీఎం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. కొత్త నిర్ణయంతో గరిష్టంగా రూ.20 వేలు చెల్లించే గ్రీన్ ట్యాక్స్ ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.3 వేలకు తగ్గనుంది. రవాణా రంగానికి అంబుడ్స్మెన్ను నియమించాలని, ఏపీ-తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల సమస్యను పరిష్కరించాలని కూడా కోరారు.