Ntr Bharosa Pension Scheme 2025: వైకల్యం ఎక్కువగా ఉండి, సదరం సర్టిఫికెట్లలో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి పింఛన్లు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇది ఊరటనిచ్చే విషయం. అర్హులైన వారికి పింఛన్లు యథావిధిగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గతంలో తనిఖీలు చేపట్టింది. అర్హులైన వారు ఎంపీడీవో కార్యాలయంలో అప్పీల్ చేసుకోవచ్చు.