AP Govt Request On Officials Toll Fee Exemption: ప్రభుత్వ కీలక అధికారుల వాహనాలకు టోల్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే, రైతులు తమకు దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని అమ్ముకునేలా నిబంధనలు సడలించాలని వ్యవసాయశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పారా మెడికల్ బోర్డు పేరు మార్పు, కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రికి నిధుల విడుదల వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.