Ntr Bharosa Pension Scheme:ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు అందిస్తోంది. వృద్ధులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు పింఛన్ అందిస్తోంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధిపడేవారికి కూడా పింఛన్ ఇస్తున్నారు. తాజాగా కొత్త పింఛన్ల అంశంపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన చేశారు. హెచ్ఐవీ బాధితుల నుంచి పింఛన్ కోసం 34,556 దరఖాస్తులు వచ్చాయని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇప్పటికే హెచ్ఐవీతో ఉన్న వారిలో 42,845 మందికి పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు.