Ambedkar Overseas Vidya Nidhi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. 'అంబేద్కర్ విదేశీ విద్యా నిధి' పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు, త్వరలోనే నియమాలు రూపొందించి, ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.364 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.