NTR Bharosa Pension Scheme Spouse Category: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంది. మే నెలలో కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేయనుంది. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వలన ప్రభుత్వంపై అదనపు భారం పడినప్పటికీ, అర్హులందరికీ పింఛన్ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.