Ntr Bharosa Pension Scheme In Eligible Persons: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది. దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించి, పింఛన్లు రద్దు చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, కొన్ని పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు. ఎన్నికలు జరిగే వరకు ఈ పాలన కొనసాగుతుంది.