ఏపీలో దివ్యాంగులకు శుభవార్త. నేటి నుంచి 'సదరం' స్లాట్ల బుకింగ్ మళ్లీ మొదలవుతుంది. వైకల్య ధ్రువపత్రాల కోసం ఇకపై ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవాళ్టి నుంచి సదరం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. రెండు నెలలకు సంబంధించి బుకింగ్స్ ఉంటాయి. గతంలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి, ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ప్రాధాన్యత ఇస్తారు. పింఛన్ తీసుకుంటున్న వారికి కూడా జనవరి నుంచి పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.