Andhra Pradesh Nethanna Bharosa Rs 25000: ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త తెలిపింది. 'నేతన్న భరోసా' పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారని మంత్రి సవిత తెలిపారు. అర్హులైన నేతన్నలకు సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని, ఉచిత విద్యుత్ పథకం గురించి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని, కొత్త డిజైన్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు.