AP Mental Disability Pensions Continue Below 18 Years: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు పింఛన్లు కొనసాగుతాయని, నోటీసులు నిలిపివేయాలని ఆదేశించింది. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న 60 ఏళ్లు పైబడిన వారిని వృద్ధుల జాబితాలోకి మార్చి రూ.4 వేల పింఛన్ ఇస్తారు. అర్హత ఉండి పింఛను రద్దయితే అప్పీలు చేసుకోవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.