AP Govt Released Rs 60 Crores To Sc St Industrialists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శుభవార్త చెప్పింది. రెండో విడతగా రూ.60.21 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. అయితే, రాయితీలు వెంటనే విడుదల చేయాలని కొందరు పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, స్థానిక పారిశ్రామికవేత్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నా, ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది.