ఉత్తరాంధ్ర కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసి.. కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పర్యాటక మంత్రి దుర్గేశ్ తెలిపారు. అంతేకాకుండా వచ్చే పదేళ్లలో ప్రతి గిరిజన రైతు కుటుంబంలో ఒకరికి పర్యాటక రంగంలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కాగా అరకు, పాడేరు, లంబసింగిలో హోమ్ స్టేలను గుర్తించినట్లు.. బొర్రా గుహలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.