ఏపీలో కూటమి ప్రభుత్వం నేతన్నలకు తీపికబురు అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మగ్గం, మర మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో లక్షకు పైగా కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని వెల్లడిచించింది. అలాగే, నేతన్నలకు పింఛన్లను రూ. 3,000 నుంచి రూ. 4,000కు పెంచుతామన్న హామీ నెరవేర్చినట్లు చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. అంతేకాకుండా చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.