ఎన్డీఆర్ భరోసా పింఛన్ల పథకంలో అనర్హుల ఏరివేతకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సదరం శిబిరాల ద్వారా వైకల్య పరీక్షలు నిర్వహించారు. అయితే కొంతమంది లబ్ధిదారులు ఈ పరీక్షలకు హాజరుకాలేదు. అలాంటి వారికి ఇప్పటికే నోటీసులు పంపించారు. అయితే ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారుల నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో మరోసారి నోటీసులు పంపిస్తున్నారు. సదరం శిబిరాలలో వైకల్య పరీక్షలు చేయించుకోనివారికి ఆగస్ట్ నెలలో పింఛన్ కూడా కొన్నిచోట్ల పంపిణీ చేయనట్లు సమాచారం.